బయ్యారం, మే 5: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు అన్నారు. ఆదివారం మండలంలోని సింగా రం, కొత్తపేట, గంధంపల్లి, సంతుల్పోడు తండా, బంజరతండా, జగ్గుతండా, జఫరాబాద్, ఇర్సులాపురం, రామగుండ, బయ్యారంలోని బీసీకాలనీ, రుద్రమదేవి వీధిల్లో వారు స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఐదు నెలలు దాటినా పట్టించు కోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్, కేసీఆరే శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడేందుకు ఎంపీగా కవితను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాత గణేశ్, వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, మండల నాయకులు ఏనుగుల ఐలయ్య, అంగోత్ శ్రీకాంత్, యూత్ అధ్యక్షుడు బానోత్ లక్ష్మణ్నాయక్, ప్రచార కార్యదర్శి రేపాకుల వెంకన్న, మాజీ సర్పంచ్ వాంకుడోత్ జగన్, బండమీది సంపత్, జర్పుల శ్రీను పాల్గొన్నారు.