రామడుగు(చొప్పదండి)/ కార్పొరేషన్/ గంగాధర, మే4: ‘కాంగ్రెస్ ఉత్త గ్యారెంటీలు.. బీజేపీ ఉద్దెర మాటలు నమ్మి మోసపోవద్దు’ అంటూ కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. గల్లీలో చోటే భాయ్ సీఎం రేవంత్రెడ్డి ఓట్ల కోసం ముక్కోటి దేవుళ్లపై ఒట్లు పెడుతుంటే.. ఢిల్లీలో బడే భాయ్ ప్రధాని మోదీ దేవుళ్ల పేరిట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వారిద్దరు కలిసి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లతో తిప్పికొట్టాలని విజ్ఞప్తిచేశారు.
శనివారం రామడుగు మండలం గోపాల్రావుపేట, గంగాధర మండలం మధురానగర్లో రోడ్షో, కరీంనగర్లోని భగత్నగర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, పార్టీ నేత పన్యాల భూపతిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల వినోద్ మాట్లాడారు. కేం ద్రం నదుల అనుసంధానం పేరిట గోదావరి నీళ్లను తమిళనాడుకు తరలించి తెలంగాణను ఏడారిగా మార్చేందుకు కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. మన నీళ్లను ఎత్తుకుపోవడానికి ప్రధాని మో దీకి హక్కెక్కడిదని నిలదీశారు.
మన నీళ్లను కాపాడుకోవాలంటే.. హక్కులు దక్కాలంటే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కనీసం ఒక్క గుడి తేలేదు..బడి తీసుకురాలేదని ఆరోపించారు. ఉప్పల్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయించలేని అసమర్థుడని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ బీజేపీవి దొంగ మాటలని, ఇగ కాంగ్రెస్వి గారడీ గ్యారెంటీలనీ, ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మద్దని సూచించారు. గుడ్డిగా ఓటేసి మోసపోవద్దని, కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో అన్ని వర్గాలు ఆగమయ్యాయని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను నమ్మించేందుకు అడ్డగోలు హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
‘పదేండ్ల కేసీఆర్ పాలనలో నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినం..వచ్చే ఎన్నికల్లో ఓటేసి ఆశీర్వదిస్తే కరీంనగర్ రూపురేఖలు మారుస్తా’ అని బోయినపల్లి వినోద్కుమార్ ప్రకటించారు. శనివారం రాత్రి ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మతం పేరిట రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఆయన పంచిన రాముడి చిత్రపంటపై మోదీ ఫొటో ఉండడంతో ప్రజలు దేవుడి రూంలో పెట్టుకోవాల్సిన చిత్రపటాన్ని అటక మీద పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రతి ఆరు నెలలకు మేళాలను నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఐటీ ఇంక్యూబెటర్ తీసుకువచ్చేందుకు పాటు పడుతానన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, బీఆర్ఎస్ నాయకులు ఏవీ రమణ, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, అనిల్, నరేందర్, రాష్ట్ర నేతలు వీర్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మి- కిష్టారెడ్డి, బీఆర్ఎస్ రామడుగు మండలాధ్యక్షుడు జితేందర్రెడ్డి, నాయకులు నాగి శేఖర్, మామిడి తిరుపతి, వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, మణెమ్మ మల్లేశం, రమణారెడ్డి, మురళి, శేఖర్రెడ్డి రాష్ట్ర నాయకులు చెన్నాడి అమిత్కుమార్, గంగాధర ఎంపీపీ శ్రీరాం మధుకర్, గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ ద్వావ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు పాల్గొన్నారు.
కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. స్మార్ట్ సిటీలో అర్హత లేకున్నా వినోదన్న చొరవ చూపి స్మార్ట్ సిటీ సాధించడం వల్లే నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాగింది.పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా ఉండే వినోద్ను గెలిపించుకుంటేనే నిధులు వస్తాయి. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వినోద్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.
– ఎమ్మెల్యే గంగుల కమలాకర్