అమరావతి : విజయవాడ ( Vijayawada ) సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత ( Tension ) పరిస్థితులు ఏర్పడ్డాయి . టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పర ఆందోళనలు నిర్వహించడంతో డీఎస్సీలో అవకతవకలు జరిగాయని,సంబంధిత మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ముత్యాలంపాడులో వైసీపీ దీక్షకు పిలుపునిచ్చింది.
వైసీపీ దీక్షకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. చంద్రబాబు, లోకేష్పై దుర్భాషలాడారంటూ వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శిబిరం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులు వైసీపీకి చెందిన టెంట్లను బలవంతంగా తొలగించారు. విజయవాడ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు. కాగా డీఎస్సీ అవకతవకలపై గురువారం నియోజకవర్గాల వారీగా రిలే దీక్షలకు పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.