అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల( AP Assembly ) షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగురోజుల పాటు నిర్వహించనున్నారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం లో అసెంబ్లీ సమావేశాల నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం అనుమతి లేకుండా తీసుకొచ్చిన దిశా పోలీస్ స్టేషన్ల ఉపసంహర ణకు, పాదచారుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026కు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది .