భద్రాద్రి కొత్తగూడెం, మే 5 (నమస్తే తెలంగాణ): ఉద్యమాల చరిత్ర కలిగిన కేసీఆర్పై కారు కూతలు కూస్తే సహించబోమని, ఖబడ్దార్.. రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమనేతపై కారు కూతలు కూస్తే ఊరుకునేది లేదని, హామీల అమలు చేతగాకే కేసీఆర్పై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తెలంగాణ సాధకుడిపై తప్పుడు మాటలు మాట్లాడితే కర్రు కాల్చి వాతలు పెడతామని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రైతుభరోసా రూ.15 వేలు, రుణమాఫీ ఏమయ్యాయని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ సీట్లు బీఆర్ఎస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యమ సారథిపై చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి పిన్ని వెంకటరమణ స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మికి తులం బంగారం ఎక్కడో చెప్పాలని ప్రశ్నించారు. హామీలను ప్రజలకు ఇచ్చి ఇప్పుడు చేయలేక తిట్ల పురాణం మొదలు పెట్టారని దుయ్యబట్టారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు రాంబాబు, కోలేటి భవానీ శంకర్, సంకుబాపన అనుదీప్, మోరే భాస్కర్, ఉద్యమనాయకులు ఎడ్ల శ్రీను, కర్నె మురళి, రవి, పాయం ప్రవీణ్, దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల, మే 5: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో అమలు చేయకుండా చేతులెత్తారని దుయ్య బట్టారు. ప్రజా సంక్షేమం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ ఎన్నికల్లో మాలోత్ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు కోలేటి భవాని శంకర్, తెల్లం భాస్కర్, వట్టం రాంబాబు, టీ రాము, గడ్డం రమేష్, గొగ్గెల రాంబాబు, గడ్డం వీరన్న,కుంజ సుధాకర్, నిట్ట రాములు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.