Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఓ ప్రధాని ఫార్ములా తెరపైకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఏడాదికి ఓ ప్రధాని పాలనా పగ్గాలు చేపట్టాలనే ఇండియా కూటమి ఆలోచన వాస్తవంగా సాధ్యమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. బిహార్లోని జన్హర్పూర్లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.
విపక్ష ఇండియా కూటమి విజయం సాధిస్తే దేశ ప్రధాని ఎవరని నిలదీశారు. వారికి అసలు దీటైన నాయకులు ఉన్నారా అని ప్రశ్నించారు. దేశ ప్రధానిగా లాలూ ప్రసాద్ అధికార పగ్గాలు చేపడతారా..? మమతా బెనర్జీ ప్రధాని అవుతారా..? స్టాలిన్ కీలక పదవిని చేపడతారా..? అని అమిత్ షా ప్రశ్నించారు. రాహుల్ బాబా తానే ప్రధాని అవుతారా అని నిలదీశారు. విపక్ష కూటమి గెలిస్తే ఏడాదికి ఒకరు ప్రధాని అవుతారని ఎద్దేవా చేశారు.
ఒక ఏడాది శరద్ పవార్ ప్రధాని అయితే మరో ఏడాది లాలూ, మరో ఏడాది మమతా బెనర్జీ, ఓ ఏడాది స్టాలిన్ ఇక పదవీ కాలం మిగిలితే రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. దేశాన్ని ఇలా నడపడం మంచిదేనా అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిని వెల్లడించలేదని అన్నారు.
Read More :
Hemant Soren | హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్..! ఈడీకి ‘సుప్రీం’ నోటీసులు..!