Yogendra Yadav | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమయ్యే పనేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా సరైన వ్యూహాలతో ముందుకు పోవట్లేదని పేర్కొన్నారు. మోదీ ఛరిష్మాతో ఈ ఎన్నికల్లో గట్టెక్కవచ్చని కొందరు బీజేపీ నేతలు భావిస్తున్నారని, అయితే, అదంతా ఓ భ్రమ మాత్రమేనని కొట్టిపారేశారు. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ఫలితాలే ఢిల్లీలో ఎవరికి అధికారం దక్కబోతున్నదన్న విషయాన్ని నిర్ణయిస్తాయని తేల్చిచెప్పారు. ఈ మేరకు కన్నడ న్యూస్ వెబ్సైట్ ‘ఈదిన’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇంటర్వ్యూలో యోగేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు