గట్టు, ఏప్రిల్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మళ్లీ పాతరోజులొచ్చాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్ప ష్టం చేశారు. గట్టులో సోమవారం బీఆర్ఎస్ విస్తృస్థాయి సమావేశానికి నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్తో కలిసి హాజరై మాట్లాడారు. అధికారం చేపట్టి 138 రోజులు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రజాభివృద్ధికి చేసేందేమీలేదన్నారు. ఒక్క పథకం కూడా అమలు కాలేదని విమర్శించారు. తె లంగాణకు అన్నం పెట్టిన బీఆర్ఎస్ను ఆదరించి ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీఆర్ఎస్ ఎంపీ అభ్య ర్థి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందు కే రాజకీయాల్లోకి వచ్చినట్లు తేల్చిచెప్పారు. పోలీస్శాఖలో ఉన్నత పదవిని చేపట్టి గురుకులాల కార్యదర్శిగా పనిచేసి వందలాది విద్యార్థులను తీర్చిదిద్దానన్నారు. తనను గెలిపిస్తే జిల్లాతోపాటు గట్టు మం డల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటేశ్, తాజా మాజీ సర్పంచ్ హనుమంతు, నాయకులు శ్రీధర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలోనే అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవా లి. గతంలో తాను గురుకులాల ముఖ్యకార్యదర్శి గా ఉన్నప్పుడు కేసీఆర్ సహకారంతో మారుమూ ల ప్రాంతాల్లోనూ పాఠశాలలను ఏర్పాటు చేశాం. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్లను ఏర్పాటు చేసి విద్యను అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే సాధ్యమవుతుంది. హైదరాబాద్కు ఎన్నో ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. పదేండ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపు ప్రజలు నిలబడాలి. రేవంత్రెడ్డి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాడు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుబంధు వేయలేదు. రుణమాఫీపై పూటకో మాట మాట్లాడుతున్నాడు. ఆగస్టు 15వరకు రుణమాఫీ చేస్తానని ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడి దేవుళ్లపై ఒట్టు వేస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నాడు. ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేకపోవడంతోనే దేవుళ్లపై ఒట్లు వేసి ఓట్లు పొందాలని చూస్తున్నాడు. ఎవరు హామీలు నెరవేర్చారో.. ఎవరు విఫలమయ్యారో ప్రజలు ఆలోచించుకోవాలి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలను ముంచడంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాయి. నడిగడ్డ బిడ్డనైన నన్ను పార్లమెంట్కు పంపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాను.