MLA Kasireddy | కడ్తాల్, (తలకొండపల్లి) మే 6 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమం గా ఉన్నది. తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం… ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం తలకొండపల్లి మండలంలోని వెల్జాల్లో కార్నర్ మీటింగ్ ముగించుకొని మిడ్జిల్ మండలం వైపు బయల్దేరారు.
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు తలకొండపల్లి-మిడ్జిల్ రహదారిపై వెల్జాల్ శివారులోని రామాసిపల్లి మైసమ్మ ఆలయం వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొన్నది. బైక్పై ఉన్న తలకొండపల్లి మండలం వెంకటాపూర్కు చెందిన పబ్బతి నరేశ్(25) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన బైరవ పరశురాములు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కారులోని ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో ఎమ్మెల్యే, డ్రైవ ర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఎమ్మెల్యే కాలికి గాయమవడంతో కల్వకుర్తిపీహెచ్సీలో చికిత్స పొంది, అనంతరం హైదరాబాద్ బయలుదేరారు.
పరుశరాములును మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పరామర్శించారు. బాధితుడి భార్య మంజులకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితుడికి మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించేందుకు చేయూతనందించారు.