హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక తరలింపును అడ్డుకునేందుకు వచ్చిన పోలీసు సిబ్బందిపై దాడికి దిగింది. మల్లాపూర్ మండలం వేంపల్లి శివారులోని వాగు వద్ద పెద్ద ఎత్తున ట్రాక్టర్లను, ఎక్స్కవేటర్లను తరలించి ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది వాగు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఇసుక మాఫియా కర్రలు, రాళ్లతో దాడికి దిగింది. దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలయ్యాయి. ఆ తర్వాత సంఘటనా స్థలంలోనే వాహనాలను వదిలి పరారయ్యారు. వాగులో వదిలి వెళ్లిన ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకొని, ఠాణాకు తరలించారు. దాడికి పాల్పడ్డ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.