టోక్యో : ఒలింపిక్స్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలోనూ భారత జోడి నిరాశ పరిచింది. క్వాలిఫికేషన్ స్టేజీ-1లో 582 పాయింట్లతో మను భాకర్ – సౌరభ్ చౌదరి జోడీ అగ్రస్థానంలో నిలిచి.. క్వాలిఫికేషన్-2కు అర్హత సాధించిన జోడీ.. ఏడో స్థానంలో నిలిచింది. క్వాలిఫికేషన్-2లో ఎనిమిది జట్లు పాల్గొనగా.. మను భాకర్ – సౌరభ్ చౌదరి జోడీ ఏడో స్థానానికే పరిమితమైంది. క్వాలిఫికేషన్ స్టేజీ-1లో 582 పాయింట్లతో మను భాకర్ – సౌరభ్ చౌదరి జోడీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పథకంపై ఆశలు చిగురించాయి. మూడవ సిరీస్లో మను-సౌరభ్ జోడీ 193 పాయింట్లు సాధించారు. మను 95, సౌరభ్ 98 ప్లాయింట్లు సాధించి మొదటి రౌండ్లో అగ్రస్థానంలో నిలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు.
ఈ రౌండ్లో సౌరభ్ అద్భుతంగా రాణించాడు. రెండవ సిరీస్లో 10-10 లక్ష్యాలను సాధించాడు. అలాగే మరో యశస్విని- అభిషేక్ వర్మ జోడీ సైతం నిరాశపరిచింది. జోడీ 17వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఒలిపింక్స్ ఐదో రోజు ఆరు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పాల్గొనున్నారు. టేబుల్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో శరత్ కమల్ ఈ రోజు బరిలోకి దిగనున్నాడు. భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్తో తలపడుతుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్రాజ్ రాన్కీరెడ్డి, చిరాగ్శెట్టి బ్యాట్మింటన్ గ్రూప్-ఏలో పాల్గొననున్నారు. అలాగే సెయిలింగ్, బాక్సింగ్లోనూ భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.