హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.35లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తి 3,16,708 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల గరిష్ఠ నీటిమట్టం 9.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 6.325 టీఎంసీల నీరు నిల్వ ఉంది.