Gajula Ramaram | రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు రాత్రిపూట దొంగతనంగా వచ్చి ఎంక్వైరీలు చేపట్టి కూల్చివేతలు చేపడుతున్నారని గాజుల రామారం బాధితులు మండిపడుతున్నారు. గాజులరామారంలో కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో మరోసారి కూల్చివేతలు చేపట్టడంపై పేద ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను కూల్చివేయగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీలతో కొట్టారు.
ఓ బాధితురాలు మాట్లాడుతూ.. నేను 45 సంవత్సరాలుగా రామారావు ప్రభుత్వం నుంచి ఇక్కడే ఉంటున్నా. నాకు చదువు రాదు. నా పిల్లలు చిన్నగుండె.. ఇప్పుడు నా పిల్లలకే పిల్లలున్నరు. అధికారులు నా దగ్గరు ఉన్న కాగితాలు చూపించే దాకా అయినా ఆగాలి కదా.. నేను హార్ట్ పేషంట్ను. నాకు నిన్ననే సర్జరీ అయింది.. దండం పెడతా అన్నా ఆగలేదు.. ఇంటిదగ్గరికొచ్చాక మీ కాళ్లు మొక్కుతా సార్ అని కాళ్ల మీద పడ్డా. ఇంకేం చేస్తానని వాపోయింది.
మొదట నోటీసులు ఇవ్వండి సార్. నేను సామాన్లు సర్దుకుంటా అంటే.. నోటీసులు బాలయ్యకు ఇచ్చినం అన్నరు. ఆయన దివ్యాంగుడు. నేనేమో హార్ట్ పేషంట్ను. లక్షాధికారులకేమో నోటీసులు ఇస్తలేరు. గరీబోళ్ల వెంబడి పడ్డరు. మరి లక్షాధికారుల ఇండ్లు కూలగొట్టాలి కదా..? మాకు లంచాలు ఇయ్య చాతగాదు.. అందుకే ఇలా చేస్తున్నరని ఫైర్ అయింది. నా ఇంట్లో నలుగురు పిల్లలున్నరు. 25 కిలోల బియ్యం సంచి ఉంది. మరి మేమెట్లా బతుకాలే.. ఇట్లా రోడ్ల మీద పడి, ఇండ్ల మీదికొస్తే.. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది.. ఈ ఎమ్మార్వోలు, ఆఐలు వచ్చి ఎంక్వైరీ చేసి రాత్రిపూట ఫోటోలు తీసుకొని పోవడం. తెల్లవారేదాకా ఇండ్ల చుట్టూ ఉండటం.. వీళ్లను దొంగలనాలా..? దొరలనాలా..? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
45 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నాము.. పత్రాలు చూపిస్తామని చెప్పినా అధికారులు వినడం లేదు
నేను హార్ట్ పేషెంట్ని.. ఆగండి సార్ అని కాళ్ల మీద పడ్డా కనికరించలేదు
హైదరాబాద్లోని గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
ఇప్పుడు మమ్మల్ని రోడ్లపై పడేస్తే ఎలా… https://t.co/xuvB53qbY7 pic.twitter.com/8UCTS3LWP2
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026