హైదరాబాద్ : కర్నాటకలో(Karnataka) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్(Travel bus )బస్సును లారీ ఢీ కొట్టడంతో బస్సులలో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమయ్యారు. మరో మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన చిత్రదుర్గ జిల్లా జవరగుండనహళ్లి శివారులో తెల్లవారు 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తున్న బస్సను లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ సహా 17 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
48వ జాతీయ రహదారిపై బెంగళూరు వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకోని అవతలివైపు ఎదురుగా వస్తున్న ప్రైవేటు స్లీపర్ కోచ్ బస్సును ఢీకోట్టింది. డీజిల్ ట్యాంక్ లీకవడంతో బస్సుకు వెంటనే మంటలంటుకున్నాయి. చూస్తుండగానే బస్సు మంటల్లో కాలిపోయింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Water On Empty Stomach | ఉదయం నిద్రలేవగానే నీళ్లను తాగితే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే..!
Naresh | ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు నరేష్.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ..
Karate Kalyani | హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు.. కరాటే కల్యాణి ఊహించని స్పందన