వరంగల్, మే 3 : లోక్సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్లో భాగంగా వరంగల్లోని దేశాయిపేట రోడ్ బృందావన్కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు, పోలీసుల సమక్షంలో ఓటు వేసింది. కుటుంబ సభ్యుల సహకారంలో వృద్ధురాలు వరంగల్ లోకసభ పరిధిలో తొలి ఓటు వేసింది. శుక్రవారం హోం ఓటింగ్లో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో 121 మంది ఓటేసినట్లు అధికారులు తెలిపారు.