TS EAPCET Results | హైదరాబాద్ : టీఎస్ ఎప్సెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు.
1. సతివాడ జ్యోతిరాధిత్య – శ్రీకాకుళం
2. గొల్లలేఖ హర్ష – కర్నూల్
3. రిషి శేఖర్ శుక్లా – సికింద్రాబాద్
4. భోగలపల్లి సందేశ్ – మాదాపూర్, హైదరాబాద్
5. మురసాని సాయి యశ్వంత్ రెడ్డి – కర్నూల్
6. పుట్టి కుశాల్ కుమార్ – అనంతపూర్
7. హుందేకర్ విదిత్ – రంగారెడ్డి
8. రోహన్ సాయి పబ్బ – ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్
9. కొణతం మణితేజ – వరంగల్
10. ధనుకొండ శ్రీనిధి – విజయనగరం