చండీగఢ్: హైవే పక్కన సూట్కేస్ పడి ఉండటాన్ని కొందరు వ్యక్తులు గమనించారు. అందులో సగం కాలిన యువతి మృతదేహం ఉండటం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Woman’s Half-Burnt Body In Suitcase) పంజాబ్లోని బతిండా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం బెహ్మాన్ దివానా గ్రామం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఎర్రటి సూట్కేస్ పడి ఉన్నది. పొలాల్లో పనిచేస్తున్న వ్యక్తులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సూట్కేస్లో సగం కాలిన యువతి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఫోరెన్సిక్ బృందంతో పాటు డాగ్ స్క్వాడ్ను రప్పించారు. యువతి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.
మరోవైపు మహిళ శరీరంపై గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. హతురాలి వయస్సు 20 ఏళ్లు ఉంటాయని అంచనా వేశారు. ఆ మహిళ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆమె హత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Employee Steals From Minister’s Office | మంత్రి కార్యాలయంలో చోరీ.. బంగారం, నగదు దొంగిలించిన ఉద్యోగి
Delhi triple murder case | కారులో మూడు మృతదేహాల కేసు.. బాబా అరెస్ట్
Toxic Fumes | భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమారుడు ఇంట్లో మృతి.. విష వాయువులు కారణమని అనుమానం
Watch: రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ.. వీడియో వైరల్తో కానిస్టేబుల్స్ సస్పెండ్