బెంగళూరు: ఒక మహిళను అత్తింటి కుటుంబం వేధించింది. వ్యభిచారం చేయాలని ఆమెను బలవంతం చేశారు. వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భాల్కికి చెందిన 22 ఏళ్ల అంజనాబాయికి బసవకల్యాణ్ ప్రాంతానికి చెందిన శేఖర్ పాటిల్తో 2022లో వివాహమైంది. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి సంతానం.
కాగా, అంజనాబాయి అత్తవారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త, అత్తమామలు తన కుమార్తెను ప్రతిరోజూ మానసికంగా, శారీరకంగా వేధించారని, వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసినట్లు ఆరోపించాడు. అక్రమ సంబంధాలు నిరాకరించినందుకు తన కుమార్తెపై దాడి చేయడంతోపాటు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు భర్త శేఖర్ పాటిల్, అత్తింటి కుటుంబానికి చెందిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మహిళ ఆత్మహత్య, ఆమె తండ్రి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: ‘నేను ఠాకూర్, నాతో పెట్టుకోవద్దు’.. కస్టమర్ను దూషించిన బ్యాంకు ఉద్యోగిని
Mamata Banerjee | సుప్రీంకోర్టులో మమతా హాజరు, వాదనలను ప్రశ్నిస్తూ.. పిటిషన్
Newborn dies | హాస్పిటల్లో అగ్నిప్రమాదం.. ఐసీయూలోని నవజాత శిశువు మృతి
EVMs Found In Car | జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత.. హోటల్ వద్ద కారులో రెండు ఈవీఎంలు