ముంబై: కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర దర్యాప్తు సంస్థలు పాలక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయని మండిపడ్డారు. అధికారాన్ని ఎప్పటికీ వాళ్ల చేతుల్లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
ఎవరో ఫిర్యాదు చేశారని ఎన్నికల సంఘం.. శివసేన పార్టీని, ఆ పార్టీ గుర్తును వ్యవస్థాకులైన వ్యక్తుల నుంచి వేరుచేసి ఫిర్యాదు చేసిన వ్యక్తులకు కేటాయించిందని విమర్శించారు. ఇది రాజకీయ పార్టీలపై పెద్ద దాడిగా చెప్పవచ్చని అన్నారు. ‘ఎన్నికల సంఘం కొన్ని రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎలా దుర్వినియోగానికి గురవుతున్నది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మునుపెన్నడూ చూడలేదు’ అని పేర్కొన్నారు.
‘శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే తన ఆఖరి గడియల్లో శివసేన పార్టీ బాధ్యతలను తన కుమారుడు ఉద్ధవ్ థాకరేకు అప్పగించాడు. కానీ, ఎవరో ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం ఆ పార్టీని, పార్టీ గుర్తును వాళ్లకు కట్టబెట్టింది’ అని విమర్శించారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీని, ఆ పార్టీ విల్లు-బాణం గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించడంపై పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..