పట్నా: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి విమర్శలు చేశారు. బీజేపీ మత రాజకీయాలతో దేశంలో హింసను ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు. మతతత్వ బీజేపీకి కాలం దగ్గరి పడిందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. నాకు ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆతృత ఏమీ లేదని తేజస్వియాదవ్ చెప్పారు. ప్రస్తుతం నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అని, ఆయన మహా కూటమిని విజయవంతంగా నడుపుతున్నారని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..