Heavy Rains | ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా నాలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ (Uttarakhand), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), పంజాబ్ (Punjab), హరియాణా (Haryana) రాష్ట్రాల్లో రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో ఆగస్టు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్, పౌరి గర్వాల్, నైనిటల్, ఉదమ్ సింఘ్ నగర్, తెహ్రీ, చంపావత్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటికే కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు కొండచరియలు విరిగి పడుతున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో కారుపై కొండచరియలు విరిగి పడటంతో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. చార్థామ్ యాత్రలో ఉన్న అయిదుగురు యాత్రికులు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులు గుజరాత్కు చెందినట్లు అధికారులు చెప్పారు. వాళ్లంతా కేదార్నాథ్ వెళ్తున్నట్లు తెలిపారు. మరోవైపు కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు రోడ్లను అధికారులు మూసివేశారు.
Also Read..
Virat Kohli | ఒక్కో ఇన్స్టా పోస్ట్కు రూ.11.45 కోట్లు.. స్పందించిన కోహ్లీ
Raghav Chadha | నమస్కారం.. నేను రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ రాఘవ్ చద్దాను
MiG-29 Fighter Jets: పాక్, చైనాకు కౌంటర్గా.. శ్రీనగర్ బేస్కు మిగ్-29 ఫైటర్ విమానాలు