Uttarakhand | ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ప్రమాదకరస్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాల్లో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఐఎండీ (IMD) అలర్ట్తో అధికారులు అప్రమత్తమయ్యారు. అనేక జిల్లాల్లో పాఠశాలలకు (Schools Shut) సెలవు ప్రకటించారు.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రానికి రెడ్, ఆరెంజ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. క్లౌడ్బరస్ట్లు, ఆకస్మిక వరదల దృష్ట్యా పౌరి గర్హ్వాల్, ఉత్తరకాశి, చమోలి, రుద్రప్రయాగ్, నైనిటాల్, ఉధమ్సింగ్ నగర్, అల్మోరా, చంపావత్, పిథోరగఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని 12వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో అనేక రోడ్లు బ్లాక్ అయ్యాయి. కాంచన్ గంగా, భనేర్పాని, కామెడ, థానా థరాలి ప్రాంతంలోని అనేక మార్గాలను మూసివేసినట్లు చమోలి పోలీసులు తెలిపారు. మరోవైపు పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read..
AAP MLA | రేప్ కేసులో అరెస్ట్.. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన ఆప్ ఎమ్మెల్యే
Railway employees | రైల్వే ఉద్యోగులకు గుడ్న్యూస్.. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా
IndiGo | విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్