యాదాద్రి భువనగిరి : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద సంఘటన జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లకారం చెరువులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్లోని సైదాబాద్ కు చెందిన స్నేహితులు నాని అలియాస్ మాధవ్ (18) రోహన్ (17) స్థానికంగా నివాసముంటున్న స్నేహితుల వద్దకు వచ్చారు.
ఈ క్రమంలో సరదాగా గ్రామ చెరువులోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. మాధవ్ మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. రోహన్ మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి