వేములవాడ : కరోనాతో ఓ పూల వ్యాపారి మృతి చెందాడు. అయితే సదరు వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్తులు అడ్డుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పడంతో కథ సుఖాంతమైంది. పోలీసుల కథనం మేరకు..సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో కరోనాతో పూల వ్యాపారి రాజు (39) మృతి చెందాడు.
కాగా, రాజు అంత్యక్రియలను మహలక్ష్మి వీధి జలాశయం సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సంకెపల్లి గ్రామ శివారు కావడంతో గౌడ కులస్తులు స్థానిక సర్పంచ్తో కలిసి గ్రామ శివారులో అంతక్రియలు నిర్వహించవద్దని రహదారికి అడ్డంగా నిలుచొని వాహనాలు వెళ్లకుండా నిలువరించారు.
వెంటనే ఎస్ఐ రఫీక్ ఖాన్, బ్లూ కోట్ పోలీసులు, కౌన్సిలర్ మారం కుమార్ చేరుకొని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారు ఒప్పుకోకపోవడంతో మూలవాగులో అంత్యక్రియలు పూర్తి చేశారు
భివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
IPL 2021: ధోనీ vs కోహ్లి.. ఆసక్తి రేపుతున్న సూపర్ సండే ఫైట్