వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 30 న జరగబోయే ఎన్నికల్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
51 వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి రంజిత్ రావు గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలోను, ఆపద సమయంలోను వరంగల్ ప్రజలకు తోడుగా నిలిచింది టీఆర్ఎస్ నాయకులేనని చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కోసం టీఆర్ఎస్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.