న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న లాక్డౌన్ను కొనసాగించే యోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ సోమవారం ఉదయంతో ముగియనుంది. కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో.. లాక్డౌన్ కొనసాగింపుపై కేజ్రీవాల్ సర్కార్ ఇవాళ మధ్యాహ్నం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గతవారం సమీక్ష నిర్వహించిన కేజ్రీవాల్.. కొవిడ్ ఉధృతి దృష్ట్యా ఆరు రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ విధించకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు.
నిన్న సాయంత్రం కేజ్రీవాల్ అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. మీ రాష్ర్టాల్లో ఉండాల్సిన ఆక్సిజన్ కంటే అధికంగా ఉంటే ఢిల్లీకి పంపాలని, ఇక్కడ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం తమకు సహకరిస్తుందన్నారు.
ఇవికూడా చదవండి..