(Visaka Steel Plant) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. యాజమాన్యం తమ జీతాల బకాయిలను క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) గుర్తింపు పొందిన యూనియన్ శనివారం సమ్మె నోటీసు ఇచ్చింది. యూనియన్ నాయకులు ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అతుల్ భట్ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ను త్వరగా పరిష్కరించే దిశగా యాజమాన్యం పనిచేయాలని ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి వైటీ దాస్ విజ్ఞప్తిచేశారు. బకాయిల చెల్లింపులో విఫలమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ఒక రోజు సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు.
సెయిల్ కార్మికులకు జీతాల బకాయిలు క్లియర్ చేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూడా జీతాల బకాయిలు చెల్లించాలని ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యాన్ని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. యాజమాన్యం ఒప్పుకోని పక్షంలో డిసెంబర్ 16న సమ్మెకు దిగుతామని తెలిపారు. సమ్మె నోటీసుపై సీఎండీ అతుల్ భట్ స్పందిస్తూ.. గత రెండు నెలల్లో అంతర్జాతీయంగా బొగ్గు ధర 150 డాలర్ల నుంచి 350 డాలర్లకు పెరిగిందని, ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని తెలిపారు.
బొగ్గు ధర పెరిగిన మాట వాస్తవమేనని, అయితే గత ఐదేండ్లుగా వేతనాల పెంపు కోసం కార్మికులు ఎదురు చూస్తున్నారని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జె సింహాచలం అన్నారు. యాజమాన్యం తమ డిమాండ్లపై పునరాలోచించి కార్మికులకు బకాయిలు వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..