(Diet Drinks and Stroke) ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు, డైట్ డ్రింక్స్ తీసుకునే అలవాటు యువతలో పెరిగిపోయింది. రాత్రి, పగలనక కృత్రిమ చక్కెరలు ఉన్న డ్రింక్స్ తాగుతూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిజానికి ఇవి పక్షవాతం, గుండె జబ్బులు, మరణాల ప్రమాదాన్ని పెంచుతాయని తెలిసినా వాటికి వ్యసనపరులుగా మారుతున్నారు. 50-59 ఏండ్ల వయసున్న 80 వేల మంది మహిళలపై జరిపిన ఒక అధ్యయనంలో కూడా ఈ విషయం రుజువైంది. నిత్యం రెండు కంటే ఎక్కువ డైట్ డ్రింక్స్ తీసుకునే వారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి.
న్యూయార్క్లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ రిసెర్చర్స్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, రెండు డైట్ డ్రింక్స్ కంటే ఎక్కువ తీసుకునే మహిళల్లో 12 సంవత్సరాల వరకు అధ్యయనం చేయగా.. వీరిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 31 శాతం ఉన్నట్లు తేలింది. 330 ఎంఎల్ వాల్యూమ్ ఒక పానీయంగా పరిగణలోకి తీసుకుని పరిశోధన జరిపారు. ఈ పరిశోధనలో 5.1 శాతం మంది 2 లేదా అంతకంటే ఎక్కువ డైట్ డ్రింక్స్ తీసుకున్న మహిళలు తేలారు. ఇలాంటి వారిలో స్ట్రోక్తో పాటు ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. అదే సమయంలో, కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 29 శాతం, మరణాల ప్రమాదం 16 శాతం పెరుగుతుంది.
కృత్రిమ స్వీటెనర్లు ఉండే ఆహార పదార్థాలు, పానీయాలు తీపి చేసేందుకు ఉపయోగించే రసాయనాలు. ఇవి రుచి పరంగా చక్కెరను పోలి ఉంటాయి. డైట్ డ్రింక్స్ శీతల పానీయాల మాదిరిగా క్యాలరీల్లో మాత్రమే తేడా ఉంటుంది. ఈ పానీయాలన్నింటిలో కృత్రిమ చక్కెరలను ఉపయోగిస్తారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..