(Today History) గుజరాత్లో ఉన్న జునాగఢ్ సంస్థానం 1947 లో సరిగ్గా ఇదేరోజున భారతదేశంలో భాగమైంది. తొలుత ఈ భాగాన్ని లాక్కున్న పాకిస్తాన్.. అప్పుడు కశ్మీర్ను కోల్పోవడమే కాకుండా అనంతర పరిణామాల్లో జునాగఢ్ను కూడా వదులుకోవాల్సి వచ్చింది. మన దేశం స్వతంత్ర దేశంగా మారిన సమయంలో మూడు రాచరిక రాష్ట్రాల విలీన అంశం క్లిష్టంగా మారాయి. అవి మూడు రాచరిక రాష్ట్రాలు – జునాగఢ్, కశ్మీర్, హైదరాబాద్. జునాగఢ్, హైదరాబాద్ రాష్ట్రాల జనాభాలో 80-85 శాతం మంది హిందువులు ఉండగా.. పాలకులు మాత్రం ముస్లింలు ఉన్నారు. కశ్మీర్లో పరిస్థితి మాత్రం వీటికి విరుద్ధంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో రాజు హిందువు కాగా.. జనాభాలో మూడో వంతు ముస్లింలు ఉన్నారు.
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత 1947 చట్టం ప్రకారం లాప్స్ ఆఫ్ పారామౌన్సీ ఎంపిక ఇచ్చింది. దీని ద్వారా మూడు రాష్ట్రాల రాజులు తమ రాచరిక రాష్ట్రాన్ని భారతదేశం లేదా పాకిస్తాన్తో కలుపుకోవచ్చు లేదా స్వంత స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. పాకిస్తాన్కు వెళ్లాలని జునాగఢ్ నవాబ్ మహబత్ ఖాన్ తన ఉద్దేశాన్ని 1947 ఆగస్టు 15న ప్రకటించారు. దాంతో జునాగఢ్ ప్రజలు గందరగోళానికి గురయ్యారు. జునాగఢ్ దివాన్ షానవాజ్ భుట్టో దీనిలో ప్రధాన పాత్ర పోషించారు. జునాగఢ్ ప్రజలు ఈ యుద్ధంలో పోరాడాలని సర్దార్ పటేల్ కోరుకుంటున్నట్లు లోక్ సేన సర్సేనాపతి రతుభాయ్ అదానీ చెప్పారు. జునాగఢ్ ప్రజలు, వారి ప్రతినిధులు గళం విప్పితేనే జునాగఢ్ ప్రాంతం భారతదేశంలోనే ఉండగలుగుతుంది. 1947 సెప్టెంబర్ 23న ఆర్జీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి సెప్టెంబర్ 25 న మ్యానిఫెస్టో కూడా రూపొందించారు.
జునాగఢ్ను ఆర్జి ప్రభుత్వంగా కాకుండా భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జునాగఢ్ దివాన్ షానవాజ్ భుట్టో అభ్యర్థించారు. దీని ఆధారంగా 1947 నవంబరు 9న జునాగఢ్ను భారతదేశం తన ఆధీనంలోకి తీసుకున్నది. 1948 ఫిబ్రవరి 20 న జునాగఢ్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా.. 2,01,457 నమోదిత ఓటర్లలో 1,90,870 మంది ఓటు వేశారు. ఇందులో పాకిస్థాన్కు కేవలం 91 ఓట్లు వచ్చాయి.
ఇవాళ జాతీయ ఉర్దూ దినం, జాతీయ న్యాయ సేవా దినం
2019: అయోధ్య రామమందిరానికి సంబంధించి చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
2019: గురునానక్ దేవ్ 550వ ప్రకాష్ పర్వ్ సందర్భంగా భారతదేశం-పాకిస్తాన్ మధ్య కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం
2018: సోమాలియాలో కారు బాంబు పేలుళ్లలో 51 మంది దుర్మరణం
2000: ఉత్తరప్రదేశ్లోని ఒక భాగం నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటు
1996 : మైక్ టైసన్ను ఓడించి మూడోసారి ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ టైటిల్ను గెలుచుకున్న ఎవాండర్ హోలీఫీల్డ్
1989 : మరణశిక్షను పూర్తిగా నిషేధించిన బ్రిటన్
1985: కార్పోవ్ను ఓడించి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన చెస్ ఛాంప్గా నిలిచిన సోవియట్ రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్
1953: ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన కాంబోడియా
1949: కోస్టారికాలో రాజ్యాంగం ఆమోదం
1937: చైనాలోని షాంఘై నగరాన్ని స్వాధీనం చేసుకున్న జపాన్ సైన్యం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..