నల్లగొండ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం ఆములూర్ గ్రామంలో గురువారం నీటి సంపులో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల కరుణాకర్, శిరీష దంపతుల రెండో సంతానం రిషికుమార్ (16 నెలలు) గురువారం ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న మూత లేని నీటి సంపులో పడిపోయాడు.
గమనించని తల్లిదండ్రులు కొంత సేపటికి చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. చివరకు నీటి సంపులో చూడగా శవమై తెలియాడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు రూ.10వేల సాయమందించి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్