హైదరాబాద్ : ఈ- పంచాయతీ నిర్వహణలో మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచినందుకు గాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సత్కరించి అభినందించారు. ప్రగతి భవన్లో గురువారం తనను కలిసిన మంత్రి ఎర్రబెల్లితో కేటీఆర్ కాసేపు మాట్లాడారు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 12 అవార్డులు వచ్చిన కొద్ది రోజులకే ఈ- పంచాయతీ లోనూ తెలంగాణ రాష్ట్రానికి మొదటి అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చే విధంగా పని చేస్తున్న మంత్రి ఎర్రబెల్లిని కేటీఆర్ అభినందించారు.
ఇదే రకమైన పనితీరుతో దేశంలో రాష్ట్రానికి, తమ పదవికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు మంత్రి వెంట ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా ఉన్నారు. కాగా, ఈ అవార్డులు రావడానికి కారణమైన సీఎం కేసీఆర్, తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి కేటీఆర్ కు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్