రంగారెడ్డి : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తికి గాయాలవ్వగా స్థానిక హాస్పిటల్కు తరలించారు. జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి కోత్వాల్ గూడా ఔటర్ రింగు రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.శంషాబాద్ వైపు నుంచి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వెళ్తున్న ఆనంద్ మోహన్ నిద్రమత్తులో ఉండగా.. కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు మాత్రం పూర్తిగా దెబ్బతింది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్రావు
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్సెంచరీ చేసిన స్టార్ ఆల్రౌండర్