అమరావతి: కరోనా వ్యాక్సినేషన్పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కోరింది. కోవాగ్జిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తిలేనిది కాదని అధికారులు వెల్లడించారు. కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సిన్ అని స్పష్టం చేశారు. రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ ఆర్టీపీసీఆర్ పాజిటివ్కు దారితీయవని చెప్పారు. వ్యాక్సినేషన్ తర్వాత పాజిటివ్ వస్తే.. వారిలో కొవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్థమని తెలిపారు. అయితే అది వ్యాక్సినేషన్ కారణంగా పాజిటివ్ వచ్చినట్లు కాదని వెల్లడించింది. వ్యాక్సినేషన్ తర్వాత జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు అర్థమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037కు చేరింది. అందులో 9,09,941 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 44,686 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 22 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 7,410కి చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..