BJP | హైదరాబాద్, ఏప్రిల్ 26 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని, లేకపోతే మీ ఇండ్లమీదకు బుల్డోజర్లను పంపిస్తామని అస్సాంలోని హైలకండీ జిల్లాలోని బుటుకుసీ గ్రామంలోని ముస్లింలను అక్కడి అధికారులు బెదిరించారు. దీంతో బాధితులు స్థానిక కోర్టును ఆశ్రయించారు.
అటవీశాఖకు చెందిన తొమ్మిది మంది అధికారులు తమను హెచ్చరించినట్టు బాధితులు వాపోయారు. అటవీశాఖ ప్రధాన కార్యదర్శి, బీజేపీ సానుభూతిపరుడు ఎంకే యాదవ్ కూడా తమను బెదిరించినవారిలో ఉన్నట్టు ఆరోపించారు. బాధితుల పిటిషన్ను విచారించిన కోర్టు దర్యాప్తు జరుపాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.