హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ లారింగాలజీ (స్వరపేటిక సమస్యలకు సంబంధించిన వైద్యవిభాగం) సమ్మిట్ మంగళవారం ఘనంగా ముగిసింది. స్టార్ హాస్పిటల్స్, లారింగాలజీ వాయిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో నిర్వహించిన 6వ ఆసియా-పసిఫిక్ లారింగాలజీ అసోసియేషన్ 14వ వార్షిక సదస్సు విజయవంతంగా ముసిసిందని నిర్వాహకులు తెలిపారు.
3 రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ, పీడియాట్రిక్ ఎయిర్వే సర్జన్ డాక్టర్ పివీఎల్ఎన్ మూర్తి ఆర్గనైజింగ్ చైర్మన్గా వ్యవహరించారు. ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్వే సర్జన్లు, లారింగాలజిస్టులు పాల్గొన్న ఈ సదస్సులో లైవ్ సర్జికల్ డిమాన్స్ట్రేషన్లు, కీలక ప్రసంగాలు, ప్యానల్ చర్చలు, వర్క్షాపులు నిర్వహించడంతోపాటు దేశంలోనే తొలిసారి లేజర్ ఆధారిత లైవ్ రోబోటిక్ ఎయిర్వే సర్జరీని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.