న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభించి మూడు నెలలకు పైనే అయింది. ఇప్పటికే సుమారు 13 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికీ కనీసం సగం మంది కరోనా పోరాట యోధులకు కూడా పూర్తి స్థాయి వ్యాక్సిన్ ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం 37 శాతం మంది ముందు వరుస పోరాట యోధులకు మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
మొత్తం 3 కోట్ల మందిలో 91 లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు కేవలం తొలి డోసు ఇచ్చారు. మొత్తంగా రిజిస్టర్ చేసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లను పరిగణలోకి తీసుకుంటే.. రెండు డోసులు తీసుకున్న వారు 47 శాతం మంది మాత్రమే. అంటే ఇంకా కనీసం సగం మంది కూడా మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోలేదు.
మొదట్లో ఆయా రాష్ట్రాలు వీళ్లను సమీకరించి వ్యాక్సిన్ ఇవ్వడంలో విఫలమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆదివారం ఉదయం వరకూ 12.26 కోట్ల డోసులు ఇవ్వగా.. అందులో 60 ఏళ్లు పైబడిన 38.9 లక్షల మంది, 45 నుంచి 60 ఏళ్ల మధ్యలోని 10.8 లక్షల మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
భక్తులకు టీటీడీ కీలక సూచనలు
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు