న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా నీట్ లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతుంటే.. ఆమె చేసిన వ్యాఖ్య లు విమర్శలకు దారి తీశాయి. సీతారామన్ మాట్లాడుతూ. . ‘నీట్ ఎగ్జామ్ వల్ల లాభపడ్డ కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. రీ ఎగ్జామ్ పెట్టడం కొందరు విద్యార్థులకు బాగా టైమ్ దొరికింది. మొదటి పరీక్షలో సరిగ్గా రాయలేని వారికి సమయం దొరకడంతో బాగా ప్రిపేర్ అయ్యారు.
చాలా మంది విద్యార్థులు తన దగ్గరకు వచ్చి రీ ఎగ్జామ్ వల్ల తమకు మంచి జరిగిందని చెప్పారని నిర్మల వెల్లడించారు. నీట్-యూజీ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ పన్షుల్ బన్సల్ తాను నిరసనల్లో పాల్గొనడం కంటే దొరికిన టైమ్ను రీఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతానని నిర్ణయించుకున్నట్టు తెలిపిన తర్వాత.. నిర్మలా ఈ కామెంట్స్ చేశారు. దీంతో నిర్మలపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు మేలు జరగాలంటే ఇక నుంచి దేశంలోని అన్ని పేపర్లు లీక్ కావాలేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేయొద్దని ఆమెకు సూచిస్తున్నారు.