న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు విస్తరిస్తున్న సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉన్నది. దాంతో దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా పరీక్షల సంఖ్యను మరింత పెంచారు. ప్రతిరోజూ లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 30.56 కోట్లకుపైగా శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం పరీక్షలు నిర్వహించిన 18,50,110 శాంపిళ్లతో కలిపి దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 30,56,00,187కు చేరిందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కల్లోలంలో బ్లాక్ ఫంగస్ బెడద
కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. మలేషియాలో జూన్ 7 వరకు లాక్డౌన్
అమెరికా తిరస్కరించిన మందును ఓకే చేసిన గోవా