సరికొత్త జలమార్గాలపై దృష్టి సారించిన కేంద్ర సర్కారు

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన సాగరమాల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ప్రయాణ సౌకర్యం ,సరుకు రవాణా మార్గాల అభివృద్ధి చేయడానికి కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గపు మంత్రిత్వ శాఖ నిరంతరంగా కృషి చేస్తున్నది. దేశానికి 7,500 కి.మీ. గల తీరప్రాంతంలోని అనువైన పోర్టులను అభివృద్ధిపరచి వాటిని సరుకు , ప్రజా రవాణాకు వినియోగించుకోవడానికి కేంద్రం సంకల్పించింది. హజారియా, ఓఖా, సోమ్నాథ్ దేవాలయం, డిఐయు, పిఐపిఏవిఏవి, దహేజ్, మంబై లేదా జెఎన్పిటి, జాంనగర్, కొచ్చి, ఘోఘా, గోవా, ముంద్రా వంటి దేశీయ, 6 అంతర్జాతీయ జలమార్గాల్ని మంత్రిత్వశాఖ గుర్తించింది.
వీటితోపాటు బంగ్లాదేశ్లోని చట్టోగ్రాం, తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ల్, మడగాస్కర్, శ్రీలంకలోని జాఫ్నాలను భారత ప్రధాన తీరప్రాంతంలోని పోర్టు పట్టణాలతో కలిపి దేశీయ , అంతర్జాతీయ జలమార్గపు సేవలను ప్రారంభించడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను సాగరమాల అభివృద్ధి కంపెనీ లిమిటెడ్(ఎస్డిసిఎల్) ఈ కార్యక్రమం క్రింద దేశవ్యాప్తంగా ఆర్వో -ఆర్వో , ఆర్వో-పాక్స్, ప్రజా రవాణా సేవలకు ఆయా మార్గాల్లో అవసరమైన సహకారాన్ని అందిస్తుంది.
ఈ కార్యక్రమం క్రింద కేంద్ర మంత్రిత్వ శాఖ హజారియా, ఘోఘా మధ్యన రోపాక్స్ , ప్రజారవాణా సేవలను ఇటీవల విజయవంతంగా ప్రారంభించి అమలుపరుస్తున్నది. ఇందువలన ఘోఘా,హజారియాల మధ్యన గల 370 కి.మీ దూరాన్ని 90 కి.మీ 10 నుంచి 12 గంటల ప్రయాణాన్ని5గంటలకు తగ్గించింది. ఈ జల మార్గం వినియోగం వలన రోజుకు సుమారు 9000 లీ. ఇంధనం ఆదా అవుతుంది. ఈ ఉత్సాహంతో కేంద్ర పోర్టులు, షిప్పింగ్ , జలమార్గపు మంత్రిత్వ శాఖ దేశ తీరప్రాంతం వెంట ఇటువంటి మరిన్ని సేవలను సుస్థిరంగా అందించడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివలన జలమార్గాన్ని అభివృద్ధిచేయడం వలన రోజువారీ ప్రయాణీకులకు, పర్యాటకులకు ,సరుకు రవాణాతోపాటు రైలు , రోడ్డు మార్గాలతోనే కాక పర్యావరణహితమైన మరో ప్రయాణమార్గాన్ని అందించినట్లవుతుంది.
-పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
-సముద్ర తీరప్రాంతాలవారికి ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుంది.
- ప్రయాణీకులకు, సరుకు రవాణాదారులకు కూడా డబ్బు , సమయం ఎంతో ఆదా అవుతుంది.
-రైలు, రోడ్డు మార్గాలపైన ఒత్తిడి తగ్గుతుంది.
ఈ ప్రయత్నానికి అనుగుణంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అభివృద్ధి కంపెనీ లిమిటెడ్ అందిస్తుంది. అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించి వారికి ప్రభుత్వం వైపునుండి అవసరమైన అనుమతులు తదితరాలను సమకూర్చుతుంది.
ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...
నష్టాల్లో ప్ర్రారంభమై లాభాల్లోకి... స్టాక్ మార్కెట్లు
స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణం ఇదే...!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం