Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో మరోసారి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని కర్నాటక మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, దాన్ని ముట్టుకోబోమని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు.
కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 50 స్ధానాలు కూడా గెలుచుకోలేదని, అందుకే రాహుల్ గాంధీ ప్రకటనలపై తాము చర్చించాల్సిన అవసరం లేదని యడియూరప్ప పేర్కొన్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున కర్నాటకలో వొక్కళిగలు, లింగాయత్లు, ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అన్నారు. కర్నాటకలో బీజేపీ 25 స్ధానాల్లో విజయం సాధిస్తుందని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.
Read More :