Mumbai train blasts case | 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసు (Mumbai train blasts case)లో బాంబే హైకోర్టు (Bombay High court) ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం (2015లో) ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ శిక్ష పడిన మొత్తం 12 మందిని నిర్దోషులుగా తేల్చింది. హైకోర్టు తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా స్టే విధించింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో విడుదలైన ఖైదీలను మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2006 జులై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్లోని పలు సబర్బన్ రైళ్లలో (suburban railway network) వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమంలో 189 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం 2015 అక్టోబర్లో 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించగా.. మరో ఏడుగురికి జీవతఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పు వెలువరించింది. అందులో ఒకరు 2021లో కరోనా కారణంగా నాగ్పూర్ జైల్లో మృతి చెందాడు.
ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం (2015లో) ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈనెల 21న సంచలన తీర్పు వెలువరించింది. మరే ఇతర కేసులు వారిపై లేనట్టయితే.. వారందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది. దోషులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు సమర్పించటంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని, దోషులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నట్టు బెంచ్ పేర్కొన్నది. హైకోర్టు నుంచి వెలువడిన ఈ తీర్పు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
Also Read..
Parliament Session | కొనసాగుతున్న విపక్షాల ఆందోళన.. లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా
N Chandrasekaran: టాటా సన్స్ చైర్మెన్కు పెరిగిన జీతం.. 155.8 కోట్ల వేతనం అందుకున్న చంద్రశేఖరన్
Horses Fight | రోడ్డుపై తలపడ్డ రెండు గుర్రాలు.. ఆటోలో ఇరుక్కుపోయి.. షాకింగ్ వీడియో