న్యూఢిల్లీ: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్(N Chandrasekaran) 2024-25 వార్షిక సంవత్సరంలో 155.81 కోట్ల వేతాన్ని ఆర్జించారు. అంతకుముందు వార్షిక సంవత్సంతో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 వార్షిక సంవత్సరానికి చంద్రశేఖరన్ 135 కోట్లు ఆర్జించారు. కంపెనీ వార్షిక రిపోర్టు ద్వారా ఈ విషయం తెలిసింది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఆయన జీతం రూపంలో 15.1 కోట్లు, ఇక ఇతర కమీషన్, లాభాల్లో భాగంగా 140.7 కోట్లు ఆర్జించారు. వాస్తవానికి గత వార్షిక సంవత్సరంలో టాటా సన్స్ కంపెనీ తన లాభాల్లో 24.3 శాతం కోల్పోయింది. అయితే అలాంటి సమయంలో టాటా సన్స్ చైర్మెన్కు జీతాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. గత ఏడాది టాటా సన్స్ లాభాలు 34,654 కోట్ల నుంచి రూ.26,232 కోట్లకు పడిపోయాయి.
టాటా సన్స్లో చేస్తున్న ఇతరు ఉద్యుగుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరభ్ అగర్వాల్ 2025 వార్సిక సంవత్సరంలో 32.7 కోట్లు ఆర్జించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 7.7 శాతం ఎక్కువ. రతన్ టాటా మృతి తర్వాత టాటా సన్స్లో చేరిన నోయల్ టాటాకు 1.42 కోట్ల కమీషన్ వచ్చింది. 2025 మార్చిలో రిటైర్ అయిన మాజీ బోర్డు సభ్యుడు లియో పురికి 3.13 కోట్ల కమీషన్ వచ్చింది. 2024 ఆగస్టులో రిటైర్ అయిన భాస్కర్ భట్ 1.33 కోట్ల కమీషన్ అందుకున్నారు.