Accident | దేశంలో రహదారులు రక్తమోడాయి. కేరళ, బీహార్ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు (Accident) చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో సుమారు 11 మంది దుర్మరణం పాలయ్యారు.
బీహార్ (Bihar)లోని బగల్పూర్ (Bhagalpur)లో ఓ ట్రక్కు ఎస్యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆమపూర్ గ్రామంలోని గోఘా పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 80పై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్లోని ధాపరి నుంచి కహల్గావ్లోని శ్రీమత్పూర్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కొందరు ఎస్యూవీలో బయలుదేరారు. కారు గోఘా పోలీసు స్టేషన్ పరిధిలోకి రాగానే.. రాడ్ల లోడు లారీ టైర్ పేలడంతో కారుపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Six dead after truck suffers tyre burst, overturns on car in Bihar’s Bhagalpur
Read @ANI Story | https://t.co/QRu891XroW#Bihar #bhagalpur #accident pic.twitter.com/Ke8pkBcBfF
— ANI Digital (@ani_digital) April 30, 2024
మరో ఘటనలో కేరళ రాష్ట్రం కన్నూర్లో సోమవారం రాత్రి ఓ కారు, లారీ ఢీ కొన్నాయి. పున్నచ్చేరిలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Kannur, Kerala: Five people died in a collision between a car and a lorry in Punnacherry, Kannur last night. The driver of the lorry sustained injuries in the accident. Further probe is underway, say police pic.twitter.com/8sQxv3BfN2
— ANI (@ANI) April 30, 2024
Also Read..
Karnataka | పెండ్లి పత్రికలో ప్రధాని మోదీ ప్రస్తావన.. చిక్కుల్లో వరుడు
Indore | ఇండోర్లో ‘సూరత్’ సీక్వెల్.. నామినేషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి