తిరువనంతపురం: శబరిమల ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. అటు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతాయని ట్రావెన్కోర్ దేవస్థానం స్పష్టం చేసింది. ప్రతి రోజూ పది వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
48 గంటల ముందే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ కలిగిన వాళ్లు, లేదంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. కేరళలో విశు పండగ సందర్భంగా ఆలయాన్ని తెరిచారు. మరోసారి ఈ నెల 14న ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరవనుండగా.. ఈనెల 18 వరకూ తెరిచే ఉంటుంది.