Parliament Winter Session | భారత పారిశ్రామికవేత్త అదానీ అవినీతి అంశం, యూపీలోని సంభల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను (Parliament Winter Session) కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. సభలో చర్చకు పట్టుబడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు రోజులుగా ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నాలుగోరోజైన శుక్రవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లోక్సభ (Lok Sabha) మధ్యాహ్నం 12 వరకూ వాయిదా పడగా.. రాజ్యసభ (Rajya Sabha) ఏకంగా సోమవారానికి వాయిదా పడింది.
ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవ్వగానే ఎగువ సభలో ప్రతిపక్ష ఎంపీల నిరంతర నినాదాలతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభను డిసెంబర్ 2వ తేదీ (సోమవారానికి)కి వాయిదా వేశారు. సోమవారం 11 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు ప్రకటించారు. అటు లోక్సభలోనూ ఇదే పరిస్థితి. అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాల పట్టుతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 వరకు వాయిదా వేశారు.
#WATCH | Amid continuous sloganeering by Opposition MPs in Rajya Sabha, House Chairman Jagdeep Dhankhar said, “…This cannot be appreciated. We are creating a very bad precedent. Our actions are not public-centric. We are getting into irrelevance…”
House adjourned for the… pic.twitter.com/10gi18wUPo
— ANI (@ANI) November 29, 2024
Also Read..
Birsa Munda: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బిర్సా ముండా ముని మనవడు మృతి
Manipur | 13 రోజుల తర్వాత.. మణిపూర్లో మళ్లీ తెరచుకున్న స్కూళ్లు, కాలేజీలు
UGC | డిగ్రీ కోర్సు కాలాన్ని మార్చుకోవచ్చు.. యూజీసీ కొత్త విధానం