పెన్పహాడ్, ఆగస్టు 03 : రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకుని విత్తనాలు వేసుకోవాలని గడ్డిపల్లి కెవికే వ్యవసాయ శాస్త్రవేత్తలు సురేష్. వి.కిరణ్ సూచించారు. సోమవారం పెన్పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురంలో చైతన్య డీమ్డ్-టు-బి యూనివర్సిటీ అగ్రికల్చర్ విద్యార్థులతో కలిసి రైతులకు భూసార నమూనా ఎలా సేకరించాలి అని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకుని పంటలు వేసుకోవాలన్నారు. ఏ పంట సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందో, పంటలకు సరైన మోతాదులో ఎరువులు వేసేందుకు భూసార ఫలితాలు మేలు చేస్తాయని తెలిపారు. పంటలు సాగు చేసేందుకు రైతులు సేంద్రీయ ఎరువులు వినియోగించాలన్నారు.
రైతులు మట్టి పరీక్ష కోసం ఒకే రకమైన పొలం అయితే ప్రతి 5 ఎకరాలకు ఒక నమూనా మట్టి సేకరించాలి. ఐదు ఎకరాలకు మించి నేల రకం ఉంటే 2 నమూనాలు సేకరించాలి. 15 ఎకరాలకు 3 నమూనాలు తీయాలి. నేల వాలు, నేల రకం మార్పులు, ఉంటే 15 సెంట్లకు ఒక నమూనా సేకరించాలి. మట్టి సేకరించే ముందు పొలాన్ని యూనిట్లుగా విభజించాలి. పొలం వాలును బట్టి నేల రకాన్ని బట్టి ఇసుక నేల, గరక నేల, నల్ల రేగడి, ఒండ్రు భూమి, వంటి రకాన్ని పంట సాగు నకు కృషి చేస్తాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లావణ్య, విద్యార్థులు భవాని, మానస, దివ్య శ్రీ, దీపికా, హస్మిత, కావేరి, స్రనవిత, రైతులు బెల్లంకొండ అంజయ్య, ఉప్పల రాంరెడ్డి, శేఖర్ రెడ్డి, విబికె నాగమ్మ పాల్గొన్నారు.