న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేల యూజర్ల ఖాతాలను నిలిపివేసినట్లు శనివారం ప్రకటించింది. పలువురు యూజర్లు ట్వీట్ల లోడింగ్లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ ద్రుష్టికి తెచ్చారని పేర్కొంది. ట్విట్టర్లో సమస్య తలెత్తడం ఇది రెండోసారి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చరిత్రలో తలెత్తిన అతిపెద్ద ఎర్రర్ ఇది.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ యూజర్లకు ఎదురవుతున్న సమస్య పరిష్కారం కోసం క్రుషి చేస్తున్నట్లు శనివారం ఉదయం 6.21 గంటలకు ట్వీట్ చేసింది.. మీలో కొందరి ట్వీట్లు లోడ్ కాకపోవచ్చు. దానికి సంబంధించిన సమస్య ఏమిటో కనుక్కునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మీకు త్వరలోనే ట్విట్టర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
సుమారు 40 వేల మంది ట్విట్టర్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు శుక్రవారం సంస్థ యాజమాన్యం ద్రుష్టికి తీసుకెళ్లారు. సిరీస్ ఆఫ్ సోర్సెస్ నుంచి ట్వీట్లను లోడ్ చేయడంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించడానికి సంస్థ డౌన్ డైరెక్టర్ ప్రయత్నిస్తున్నారు. ట్వీట్లు సబ్మిట్ చేస్తున్నప్పుడు యూజర్లకు ఎర్రర్ వస్తున్నది.
సెర్చ్ టర్మ్స్ మొదలు ట్వీట్ల లోడింగ్ ఫెయిల్ వరకు యూజర్లు పలు రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. వరస్ట్-కేస్ సినారియో, డెస్క్టాప్లపై లాగ్ఔట్ ఎర్రర్ వంటి సమస్యలు కూడా వచ్చాయి. ప్రత్యేకించి డెస్క్టాప్ యూజర్లకే ఎక్కువగా సమస్యలు వచ్చినట్లు తెలుస్తున్నది.
ప్లీజ్ ట్రై ఎగైన్ అనే సూచనలు కూడా యూజర్లకు అందాయి. కెన్నాట్ రీట్రైవ్ ట్వీట్ @ దిస్ టైం.. ప్లీజ్ ట్రై ల్యాటర్ అనే సంకేతాలను యూజర్లు అందుకున్నారు. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యూజర్లకు ట్విట్టర్ యాప్లో ఎటువంటి సమస్యలు రాలేదు.
స్మార్ట్గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఎల్ఐసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. 16% వేతనాల పెంపు
ముగిసిన తిరుపతి ఉప ఎన్నిక.. 64.29 శాతం పోలింగ్