Rahul Gandhi : ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ జరుగుతున్న వేళ లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (Opposition leader), కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Rahul Gandhi).. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది.
ఈ సందర్భంగా ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ అధికార ఆప్ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ప్రజాస్వామ్య పండుగలో అందరూ భాగస్వాములు కావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓ పక్క స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఎవరు చేశారో.. ఓటు వేసేటప్పుడు ఢిల్లీ ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ఉద్దేశించి రాహుల్గాంధీ ఈ కామెంట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ హక్కులను తిరిగి పొందుతారని, రాజ్యాంగం బలోపేతమై ఢిల్లీ మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. కాగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో ఇవాళ ఉదయం రాహుల్గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ‘నా ప్రియమైన ఢిల్లీ సోదర సోదరీమణులారా..’ అంటూ రాహుల్గాంధీ తన సోషల్ మీడియా పోస్టును మొదలుపెట్టారు.
ఢిల్లీ ఓటర్లు అంతా ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసేటప్పుడు ఢిల్లీలో కాలుష్యం, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులో గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛమైన రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది ఎవరో కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. పని చేయనివాళ్లను మళ్లీమళ్లీ గెలిపించి ఓటును వృథా చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
ఢిల్లీలో 13,766 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వివిధ పార్టీల నుంచి 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. పాలనా రికార్డు, సంక్షేమ పథకాలే ఆధారంగా వరుసగా మూడవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లోనైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి.
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు
IT Employee | మాదాపూర్లో బిల్డింగ్పై నుంచి దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య..
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు