కోల్కతా: ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ ఆశలు పెట్టుకున్నది. కానీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. అప్పటి నుంచే సీన్ రివర్సైంది.
టీఎంసీ సీన్ తిరగేసింది. బీజేపీలో చేరిన నేతలందరినీ ఆకర్షించడం ప్రారంభించింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్లో చేరాలని కోరుకుంటున్నారు. వీరంతా టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలున్నారు. పార్టీలో చేరిన వారిలో 13 మందికి బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీ-ఫామ్లు ఇచ్చింది.
బీజేపీ తరఫున ఎన్నికైన 33 మంది ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ తనయుడు సుభ్రాంశు రాయ్ కూడా తృణమూల్ పార్టీలో చేరాలని కోరుకుంటున్నారు. బిజ్పూర్ స్థానం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు.
తృణమూల్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సుభ్రాంశ్ రాయ్.. బీజేపీని ఉద్దేశించి ఫేస్బుక్ ఖాతా వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్నికైన ప్రజా ప్రభుత్వంపై విమర్శలకు బదులు ఆత్మశోధన చేసుకోవాలని బీజేపీకి సూచించారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీలో ఫిరాయింపులు వట్టి పుకారేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి శామిక్ భట్టాచార్య కొట్టిపారేశారు. ఈ ప్రచారం అంతా అబద్ధం అని పేర్కొన్నారు.
కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నది. బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి తొందర పడటం లేదు. దీనిపై శనివారం సమావేశమవుతున్నామని తృణమూల్ ఎంపీ షుఖేందు శేఖర్ రాయ్ చెప్పారు. ఈ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై చర్చిస్తామన్నారు.
తృణమూల్లో చేరేందుకు సిద్ధం అని మాజీ ఎమ్మెల్యే సరళా ముర్ము, రాజకీయవేత్తగా మారిన ఫుట్ బాలర్ దీపేందు బిశ్వాస్ తమ మనస్సులో మాట బయటపెట్టుకున్నారు. 294 స్థానాల బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 213 స్థానాల్లో తృణమూల్, 77 సీట్లో బీజేపీ గెలుపొందింది.
వీరిలో 50 మందికి పైగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారే. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్న వారే. కానీ ఎన్నికల ఫలితాలతో తృణమూల్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
ఇలాగైతే 2025 నాటికే అందరికీ వ్యాక్సిన్ : శివసేన
కేఎస్ఆర్టీసీ ఇక కేరళదే.. కర్ణాటకకు షాక్
కశ్మీర్ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..
ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు
జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు
ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం
అత్యంత అందవిహీనమైన భాష కన్నడ అన్న గూగుల్.. క్షమాపణ చెప్పిన సంస్థ
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడకానికి దరఖాస్తు
పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..
ఈటల రాజేందర్ను ఎవరూ కాపాడలేరు : ప్రభుత్వ విప్ గువ్వల
రూ.43000 కోట్లతో ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి ఆమోదం
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం