ముంబై: మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాదీ (ఎంవీఏ) కూటమి సర్కార్కు శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు చెందిన రూ.4.20 కోట్ల విలువైన చిరాస్థులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు అనిల్ దేశ్ముఖ్ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్ముఖ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జప్తు చేసింది.
నేవీ ముంబైలో ప్రతిపాదిత విమానాశ్రయానికి సమీపంలో ఒక ఫ్లాట్, భారీ మొత్తంలో ఇండ్ల స్థలం అనిల్ దేశ్ముఖ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయి. వీటి విలువ రూ.4 కోట్లు.. మార్కెట్ విలువ రూ.100 కోట్ల పై చిలుకేనని ఈడీ వర్గాలు తెలిపాయి.
అనిల్ దేశ్ముఖ్ భార్య ఆరతి దేశ్ముఖ్, ప్రీమియర్ పోర్ట్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గల ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ (రూ.1.54 కోట్లు), ఇంకా రూ.2.67 కోట్ల విలువైన 25 ఇండ్ల స్థలాలను కూడా జప్తు చేశారు.
రూ.100 కోట్ల మేరకు ముడుపులు వసూళ్లు చేశారని మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో అనిల్ దేశ్ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పీఎంఎల్ఏ కింద ఈడీ కేసు రిజిస్టర్ చేసింది.
కోర్టుకే కాదు, ఎక్కడికైనా వెళ్లు.. సువేందుపై ముకుల్ రాయ్ ఫైర్
హిందూ మహా సముద్ర ప్రాంతానికి బ్రిటన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్
టూ వీలర్స్ కు అద్దాలు తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు
2023 చివరిలోగా అయోధ్య ఆలయంలో భక్తుల పూజలకు అనుమతి
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో డెల్టా వేరియంట్ వల్లే 80 శాతం మందికి ఇన్ఫెక్షన్
Ola electric scooter : ఓలా బైక్ బుకింగ్స్ ప్రారంభం.. ఫీచర్లు ఇవే